27న సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజా ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా దాదాపుగా ఇదే రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

ఈ సమావేశం ఈనెల 27న జరుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కీలక భేటీలో దేవంలో కరోనా ఉధృతిపై మరియు అన్ లాక్ 3.0 పరిస్థితులపై చర్చించనున్నారు. కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఏంచేయాలి, ప్రజలను అదుపులో ఉంచి కేసులను తగ్గంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ అనే విషయమై చర్చించేందుకు సీఎంలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.  

Leave a Comment