28న ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’..

ఈనెల 28న మన్ కీ బాత్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలతో మాట్లాడనున్నారు.  ఈ కార్యక్రమానికి రెండు వారాల సమయం ఉన్నప్పటికీ ప్రజలు కరోనా వైరస్ మరియు లాక్ డౌన్ గురించి తమ ఆలోచనలు మరియు సూచనలు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

మీ సూచనలు కామెంట్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా ఇవ్వచ్చన్నారు. మీ సూచనలు కోవిడ్-19తో పోరాడటానికి ఎంత సహాయపడతాయన్నారు. ఎల్లప్పుడు ప్రజల ఆలోచనలు మన్ కీ బాత్ యొక్క బలమని, ఇది 130 కోట్ల మంది భారతీయుల ఐక్యతను ప్రదరర్శించే ఒక శక్తివంతమైన వేదిక అని అన్నారు. మన్ కీ బాత్ లో మీ సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-7800 ను అందబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెంబర్ కు కాల్ చేసి మీ మెసేజ్ ను చెప్పొచ్చు. 

Leave a Comment