చైనాకు ప్రధాని మోడీ వార్నింగ్..

భారత సైనికుల త్యాగం వృధా కానివ్వబోమని ప్రధాని మోడీ అన్నారు. కరోనా వైరస్ కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంలతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చైనా సరిహద్దు ఉద్రిక్తతపై ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. 

‘భారతదేశం శాంతిని కోరుకుటుంది. కానీ రెచ్చగొడితే మాత్రం ఏలాంటి పరిస్థితి అయినా తగిన సమాధానం ఇస్తాం’ అంటూ ప్రధాని మోడీ చైనాను హెచ్చరించారు. చైనాతో పోరాడుతూ మన సైనికులు మరణించడం బాధాకరమని, దీనికి దేశం గర్విస్తుందని అన్నారు. 

Leave a Comment