సీఎంలతో ప్రధాని రేపు సమావేశం

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్‌ తోపె వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని కేంద్ర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు రాష్ట్రాలకు కూడా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8గంటలకు కరోనాను కట్టడిచేసే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

 

Leave a Comment