‘డ్రీమ్ 11’ లో రూ.200 పెట్టి రూ.కోటి గెలిచిన ప్లంబర్..!

క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏదంటే గుర్తుకొచ్చేది ‘డ్రీమ్ 11’.. ఇందులో తమ టీమ్ ను సెలెక్ట్ చేసుకుంటే.. ఆ టీమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే.. కోటీశ్వరులు అయిపోవచ్చు.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది ఈ యాప్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలా ఓ ప్లంబర్ జీవితాన్నే ఐపీఎల్ మార్చేసింది. ‘డ్రీమ్ 11’ క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు.

బిహార్ లోని కటిహార్ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్ అనే వ్యక్తి హంస్ వర్ గ్రామంలో ప్లంబింగ్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈమధ్య తనతో పని చేసే వ్యక్తి ద్వారా డ్రీమ్ 11 యాప్ గురించి తెలుసుకున్నాడు. ఈక్రమంలో అక్టోబర్ 10న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్-1 మ్యాచ్ పై బబ్లూ రూ.200 బెట్ వేశాడు. అతనికి అదృష్టం కలిసొచ్చింది. ఆ మ్యాచ్ లో ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు. అందులో రూ.30 లక్షలు పన్ను రూపంలో కట్ చేసుకోగా.. రూ.70 లక్షలు బబ్లూకు వచ్చాయి.. ఇక ఈ డబ్బుతో కొత్త ఇంటిని కట్టుకోవడమే కాకుండా కొంత డబ్బును దేవాలయానికి విరాళంగా ఇస్తానని బబ్లూ చెప్పాడు.  

Leave a Comment