యువతిపై తండ్రి సహా 28 మంది అత్యాచారం.. ఫిర్యాదులో రాజకీయ నేతల పేర్లు..!

ఓ 17 సంవత్సరాల యువతిపై ఆమె తండ్రి సహా 28 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో వెలుగుచూసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల మేరకు యువతి తండ్రి ట్రక్ డైవర్ గా పని చేస్తున్నాడు. ఆమె 6వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించాడు. కొంత కాలం తర్వాత పొలానికి తీసుకెళ్లి కూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు. 

ఆ తర్వాత ఆమెను రెగ్యులర్ గా కొన్ని హోటళ్లకు తీసుకెళ్లేవాడు. అక్కడ చాలా మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  ఇలా చాలా ఏళ్లుగా ఆమెపై లైంగిక దాడులు జరుగుతున్నాయని బాధితురాలు తెలిపింది. తనపై అత్యాచారం చేసినవారిలో రాజకీయ నేతలు కూడా ఉన్నారని యువతి ఆరోపించింది. 

బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో బీఎస్పీ, ఎస్పీ రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమాజ్ వాదీ పార్టీ నేత తిలక్ యాదవ్ ఈ ఆరోపణలను ఖండించారు. తనపై కుట్ర జరుగుతోందని, తన నేరం రుజువైతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. 

Leave a Comment