స్నేహితుడి భార్యపై కన్నేసి.. బెదిరించి అత్యాచారం..!

స్నేహితుడే కదా అని ఇంట్లోకి రానిస్తే.. వెన్నుపోటు పొడిచాడు ఓ దుర్మార్గుడు.. ఏకంగా స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి అతడి వేధింపులు భరించలేక ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

గాజుల రామారంలోని నెహ్రూ నగర్ కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఈక్రమంలో స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, అంగీకరించకపోతే చచ్చిపోతానని, లేదంటే చంపుతానని స్నేహితుడి భార్యను ప్రశాంత్ బెదిరించేవాడు. అలా ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు.

అంతేకాక లైంగిక దాడికి సంబంధించిన వీడియోలు రికార్డ్ చేశాడు. వాటిని చూపించి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే ఆమెను, పిల్లలను, భర్తను చంపేస్తానని ప్రశాంత్ బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించి స్నేహితుడి భార్య నుంచి ఇప్పటి వరకు రూ.16 లక్షలు వసూలు చేశాడు. చివరికి వేధింపులు తట్టుకోలేక ఆమె పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.        

Leave a Comment