ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు..!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణకు తాము అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి సమగ్ర షెడ్యూల్ ను త్వరలో రిలీజ్ చేస్తామని ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. 

ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు, ఏపీలో కరోనా తగ్గిందని పేర్కొన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని, నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.  

Leave a Comment