‘పాకిస్తాన్, భారత్ లో భాగం అవుతుంది’

ఎప్పటికైనా పాకిస్తాన్ లోని కరాచీ భారత్ లో భాగం అవుతుందని  మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను భారత్ లో విలీనం చేసి ఒకే దేశంగా మార్చాలని బీజేపీ భావిస్తే అందుకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. 

మాజీ సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారత్ లో విలీనం కావాలని మేము కూడా భావిస్తున్నామని, బెర్లిన్ గోడ బద్దలైనప్పుడు, భారత్, పాకిస్తాన్ లు ఒకటి ఎందుకు కాలేవన్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకటవుతాయంటే తాము కచ్చితంగా స్వాగతిస్తామని మాలిక తెలిపారు.   

 

Leave a Comment