వైఎస్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. 

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వివిదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వాఖ్యలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘నేను సైన్సి టీచర్ని..ప్రకృతిని నమ్ముతాం..వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టలో.. నువ్వు కూడా గంతే.. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది’ అంటే వైఎస్ మరణాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతున్నారు. ‘తమరి బతుకెంత? మీరు వైఎస్సార్ మరణం గురించి మాట్లాడేంత వారా? రాజకీయం చేయాలనుకుంటే మీ ప్రత్యర్థి పార్టీలను విమర్శించుకోండి. మీ రాజకీయం కోసం గుడికే వెళ్తారో, గుండు కొట్టించుకుంటారో మాకు అనవసరం’ అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. 

Leave a Comment