గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే అనుమతి..

లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ని ఇతర జిల్లాల లో చిక్కుకున్న వలస కార్మికులు 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలసి సూచించింది. అయితే కేవలం గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది. 

రిలీఫ్ క్యాంప్ లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వారికి రాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తారు. కోవిడ్-19 పరీక్షల్లో నెగటివ్ వస్తే వారిని బస్సులో 50 శాతానికి మించకుండా తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం క్వారంటైన్ ఉండాలని తెలిపింది. 

ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తిస్తే ఆ గ్రూపు మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా పేర్కొంది. 

ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పింది. వచ్చిన వారికి స్క్రీనింగ్ తో సహా, పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. 

ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటెన్మెంట్ జోన్ నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించింది. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్ కు పంపి…. పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

 

Leave a Comment