ఏపీలో కబళిస్తున్న కరోనా..

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు కబళిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525కు చేరింది. 

గడచిన 24 గంటల్లో కర్నూలులో 25 కేసులు, గుంటూరులో 2, కృష్ణా 12, కడప 4, నెల్లూరు 6, అనంతపురంలో 4, విశాఖలో 4 , ఈస్ట్ గోదావరి 3, వెస్ట్ గోదావరి 1  చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు వచ్చాయి. ఇక అత్యధికంగా కర్నూలు జిల్లాలో 436 కేసులు, గుంటూరు 308,  కృష్ణా జిల్లాలో 258 కేసులు నమోదయ్యాయి. 

కరోనా పాజిటివ్ తో ఇప్పటి వరకు 33 మంది మరణించారు. కరోనాతో 441 మంది రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆస్పత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 5943 శాంపిల్స్ పరీక్షించగా 62 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

 

జిల్లా పేరుకేసుల సంఖ్య
కర్నూలు436
గుంటూరు308
కృష్ణా258
నెల్లూరు90
కడప83
చిత్తూరు80
అనంతపురం71
ప్రకాశం61
పశ్చిమ గోదావరి59
తూర్పు గోదావరి45
విశాఖపట్నం29
శ్రీకాకుళం5
విజయనగరం0
మొత్తం1525

 

Leave a Comment