విష సర్పం కాటేసిందని.. నోటితో కొరికి చంపేశాడు..!

పాము కాటేసిందన్న కోపంతో ఓ వ్యక్తి పామును నోటితో కొరికి చంపేశాడు.. ఈ వింత ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జాజ్ పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర(45) అనే గిరిజన రైతు బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడి కాలిని ఏదో కరిచింది. 

ఏం కరిచిందో అని తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేసి చూశాడు. తనన కరిచింది విషపూరితమైన పాముగా గుర్తించాడు. వెంటనే కోపంతో ప్రతీకారం తీర్చుకునేందుక ఆ పామును పట్టి పదే పదే కొరికాడు. 

దీంతో ఆ పాము వెంటనే ప్రాణాలు వదిలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పామును కరిచిన కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరణించిన పామును తీసుకుని తన గ్రామానికి వచ్చిన బద్ర జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది.   

Leave a Comment