4 బంతుల్లోనే మ్యాచ్ గెలిచారు..!

దేశవాళి క్రికెట్లో సంచనం జరిగింది. ప్రత్యర్థి జట్టును 17 పరుగులకు ఆలౌట్ చేసిన లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే పూర్తి చేసి అద్భుతం చేసింది ముంబై మహిళ జట్టు.. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నాగాలాండ్, ముంబై జట్లు తలబడ్డాయి. 

నాగాలాండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ముంబై బౌలర్ సయాలి చెలరేగిపోయింది. 8.4 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టింది. సయాలి దెబ్బకు నాగాలాండ్ జట్లు 17.4 ఓవర్లలో కేవలం 17 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్లు కేవలం 4 బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.   

Leave a Comment