అమ్మాయిలు చిరిగిన జీన్స్ ధరించడంపై దుమారం..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరిగిన జీన్స్ ట్రెండ్ అవుతోంది. మహిళలు చిరిగిన జీన్స్ వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ అమ్మాయిలు చిరిగిన జీన్స్ వేసుకోవడంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ‘చిరిగిపోయిన జీన్స్ వేసుకుని ఎక్స్ పోజింగ్ చేయడం, వాటిని ధరంచడం స్టేటస్ సింబల్ గా భావించడం దురదృష్టకరం. ఇది మన సంస్కృతిని దెబ్బతీయడమే అవుతుంది.’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియా వేదికగా తీరథ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్వ నవేలీ కూడా సీఎం వ్యాఖ్యలపై మండిపడింది. తమ వస్త్రధారణ మార్చే ముందు మీరు మీ ఆలోచనలను మార్చుకోవాదలని, ఎందుకంటే మీరు సమాజానికి ఇస్తున్న సందేశాలు తమను మరింత షాక్ కు గురిచేస్తున్నాయంటూ విమర్శించారు. తాను గర్వంగా జీన్స్ ధరిస్తాను అంటూ సోషల్ మీడియాలో జీన్స్ ధరించిన ఫొటోను షేర్ చేసింది.  

 

Leave a Comment