జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ నుంచి తరిమేశారు.. మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు..!

చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన శని అని గతంలో దివంగత ఎన్టీఆర్ అన్నారని మంత్రి రోజా తెలిపారు. శనివారం తిరుపతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండం, దండలు పెడుతున్నాడని విమర్శించారు. మహానాడులో అయినా ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ కి భయపడి ఆయన్ను పార్టీ నుంచి తరమేశారని మంత్రి రోజా ఆరోపించారు. బాలకృష్ణను చంద్రబాబు దారుణంగా మోసం చేశారన్నారు. మహానేత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత సీఎం అయ్యే అవకాశం బాలయ్యకు ఉన్నా.. ఆయన్ను అమాయకుడిని చేసి చంద్రబాబు దక్కించుకున్నారని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేయాలని బాలకృష్ణకు సూచించారు. ఇప్పుడున్నది డూప్లికేట్ టీడీపీ అన్నారు. సీఎం జగన్ ని, మమల్ని తిట్టడానికే మహనాడు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ బతికే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏంటో అందరికి తెలుసని రోజా అన్నారు. 

కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను టీడీపీ, జనసేన నాయకులు కాల్చేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని, ఆయన మీటింగ్ కి  వచ్చే జనం కూడా ఆయనకు ఓటు వేయరని అన్నారు. పవన్ కళ్యాణ్ ని ఒక నాయకుడిగా తాము భావించడం లేదన్నారు. ఆయన టైమ్ పాస్ కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  

 

 

Leave a Comment