నిరుద్యోగులకు భారతీయ పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3446 పోస్టులు ఉండగా ఏపీలో 2296, తెలంగాణలో 1150 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం) లేదా డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు – 3446
అర్హత – పదో తరగతి పాసై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాషలో మంచి మార్కులు సాధించి ఉండాలి. స్థానిక భాషలో మాట్లాడటంతో పాటు రాయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు – 2021, జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం – పదో తరగతి మార్కుల ఆధారంగా..
దరఖాస్తు విధానం – ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు – రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ ఉమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు..
దరఖాస్తులకు చివరి తేదీ – ఫిబ్రవరి 26