రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ పథ్ వద్ద వివిధ రాష్ట్రాల నుంచి పలు శకటాలను ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక శాఖ నిర్మాణంలో ఉన్న అయోధ్య ఆలయ నమూనా శకటాన్ని పరేడ్ అనంతరం ప్రదర్శించారు. ఈ శకటంపై వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున్నట్లు చూపించారు.
రాముడి చిత్రంతో పాటు హనుమంతుడు సంజీవనిని తీసుకురావడం, జటాయు-రాముడు సంవాదం తదితర దృశ్యాలను శకటంపై ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రదర్శించిన శకటాల్లోకెల్లా రామాలయం నమూనా శకటం రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటానికి మొదటి బహుమతిని ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రైజ్ ని యూపీ ప్రభుత్వానికి అందజేనున్నారు. దీనిని రూపొందించిన కళకారులను, శకట తయారీదారులను ఆయన అభినందించారు.