4 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు.. నేడు లోకాన్ని విడిచి వెళ్లారు..!

రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులోని తిరవళ్లూరు జిల్లా మప్పేడులో జరిగింది. వివరాల మేరకు అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్(31), తాంబరం పెరంగళత్తూరుకు చెందిన వైద్యురాలు కార్తీక(30) అక్టోబర్ 28న పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఉదయం వీరు పెరంగళ్తూరు నుంచి అరక్కోణంకు కారులో బయలుదేరారు. 

తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని కూవం వద్ద సిమెంట్ లారీ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో మనోజ్ కుమార్, కార్తీక అక్కడికక్కడే ప్రాణాలు కల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న నవదంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

Leave a Comment