హత్రాస్ ఘటనలో కొత్త ట్విస్ట్.. బాధితురాలికి, నిందితుడికి మధ్య ఫోన్ కాల్స్..

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన హత్రాస్ ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, ప్రధాన నిందితుడు సందీప్ సింగ్ ఏడాది నుంచి ఫోన్ లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు బాధితురాలి కుటుంబం, సందీప్ సింగ్ కాల్ రికార్డులను పరిశీలించారు. ఈక్రమంలో బాధితురాలు, నిందితుడితో నిరంతరం ఫోన్ టచ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్ నుంచి సందీప్ కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రెండు ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్ గోయింగ్ కాల్స్, 42 ఇన్ కమింగ్ కాల్స్ మొత్తం 104 కాల్స్ ఉన్నాయని రికార్డులు చూపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై దళిత సంఘాలు, వివక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే కేసును తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ కేసుపై సిట్ బృందం సీఎం యోగికి నివేదిక ఇవ్వనుంది. 

 

Leave a Comment