జగన్ సర్కార్ కు కేసీఆర్ వార్నింగ్..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు మంగళవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుతో పాటు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని స్పష్టం చేశారు. ఆపకుంటే అలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని హెచ్చరించారు. 

దీని ద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపీ సర్కార్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించబోమన్నారు. తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  

 

Leave a Comment