అన్ లాక్ 1.0 లో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి రాష్ట్రలో ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త రూల్స్ ఇవే..
- ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లో రద్దీ కాకుండా ఉండేలా భక్తులు వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
- ప్రవేశ మార్గాల వద్ద కచ్చితంగా హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉండాలి.
- ప్రార్థనా మందిరాల్లో భక్తులను దశల వారీగా పంపించాలి.
- క్యూలైన్లలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి.
- ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లోకి వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
- ప్రార్థన మందిరాల్లో తీర్థప్రసాదాలు ఇవ్వడం, భక్తి గీతాలు ఆలపించడం, పవిత్ర జలం చల్లడం వంటివి చేయకూడదు. విగ్రహాలు, పవిత్ర గంథాలను తాకకుండా చూడాలి.