కరెంట్ కోతకు పరిహారం..దేశంలోనే ఫస్ట్ టైం..

విద్యుత్ కోతకు పరిహారం..అవునండి..మీరు చదివింది..నిజమే..మితిమీరిన కరెంటు కోతలతో ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారికి పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది ఛత్తీస్ గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(సీఎస్ఈఆర్సీ). వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు తాము కట్టబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో కరెంట్ కోతలకు పరిహారం చెల్లించే విధానాన్ని దేశంలో మొదటి సారిగా అమలు చేస్తున్న రాష్ట్రంగా రికార్డుల్లోకి కూడా ఎక్కింది ఛత్తీస్ గఢ్..

 విద్యుత్ చట్టం-2003 ప్రకారం వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరతంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి లక్ష్యాన్ని నిర్ధేశించారు. దీని ప్రకారం విద్యుత్ సరఫరా యొక్క నాణ్యత లోపాలను పరిష్కరించే బాధ్యత సీఎస్ఈఆర్సీకి ఇచ్చినట్లు సీఎస్ఈఆర్సీ కార్యదర్శి ఎస్పీ శుక్లా తెలిపారు. దీని ప్రకారం 10 లక్షలు లేదా అంతకన్న ఎక్కువ జనాభా ఉన్న నగరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఒక నెలలో మొత్తం 10 గంటల కంటే ఎక్కువ సమయం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పంపిణీ సంస్థ పరిహారం చెల్లిస్తుందన్నారు. 

పట్టణ, గ్రామాణ ప్రాంతాలకు ఈ కాలంలో నెలకు 20 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయ పరిమితిని నిర్ధేశించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి పట్టణ ప్రాంతాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు పరమితిని నిర్ణయించారు. 

సాధారణంగా అయితే లైన్ లోపాలను సరిదిద్దడానికి పట్టణ ప్రాంతాల్లో ఆరు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల సమయాన్ని నిర్ణయించారు. ట్రాన్స్ ఫార్మర్లను రిపేయిర్ చేయడానికి పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 5 రోజుల సమయం తీసుకోవచ్చు. దెబ్బతిన్న డొమెస్టిక్ మీటర్లను పట్టణాల్లో 8 గంటలు, గ్రామాల్లో రెండు రోజుల్లోగా పునరుద్ధరించాలి. దీని పాటించడంలో విద్యుత్ పంపిణీ సంస్థ విఫలమైతే, అది రోజుకు రూ.50 చొప్పున పరిహారం చెల్లిస్తుంది. 

Leave a Comment