చెట్టును పెళ్లి చేసుకోబోతున్న నయనతార.. అసలు కారణం అదేనా..?

నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నోరోజులుగా వార్తులు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ జంట తమ పెళ్లి విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. వీరి వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అయితే నయనతార, విఘ్నేష్ పెళ్లి వాయిదా పడటానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది..

తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నయనతార జాతకంలో దోషం ఉందని, దోష పరిహారం చేసుకునేంత వరకు పెళ్లి చేసుకోకపోవడమే బెస్ట్ అని పండితులు చెప్పారట. దీంతో వీరు వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్లు వార్తులు వస్తున్నాయి. నయనతారకు ఆ దోషం పోవాలంటే ముందుగా ఓ చెట్టును పెళ్లి చేసుకోవాలని జ్యోతిష్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో నయనతారు చెట్టును పెళ్లాడేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. చెట్టును పెళ్లి చేసుకున్న తర్వాత విఘ్నేష్ ను పెళ్లి చేసుకోవడంం ద్వారా దోష నివారణ జరుగుతుందని పండితులు చెప్పారట. దీంతో ముందుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి విఘ్నేష్, నయనతార పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది..  

 

Leave a Comment