దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ పిరికివాడు : నారా లోకేష్

టీడీపీ నాయకుడు నారా లోకేష్ సీఎం జగన్, వైసీపీ పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్వీట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బెదిరించి, వారి పీక మీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

‘వైసీపీ తరపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారు. పలాస, రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ  అధినేత జగన్ కు తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయం’ అంటూ వ్యాఖ్యానించారు. 

‘వైసీపీ అభ్యర్థులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టీడీపీ అభ్యర్థులను ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు. నువ్వొక నాయకుడివి. నీదోక పార్టీ.. అందుకే నిన్ను పిరికివాడు అనేది’ అంటూ నారా లోకేష్ సీఎం జగన్ పై  విమర్శలు చేశారు.  

 

Leave a Comment