అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సూచించింది. చంద్రబాబుపై 120 బి, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ లాండ్యస్ 1977, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.
ఈ ఘటనపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ‘తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని నమ్మించడానికి వైఎస్ జగన్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు?’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.
‘21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవ భూమి తనని తానే కాపాడుకుంటుంది.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి @ysjagan పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది.అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు?(1/2) pic.twitter.com/T8dLW4LBim
— Lokesh Nara (@naralokesh) March 16, 2021