‘సింహాచలం రా తేల్చుకుందాం’.. సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్..!

రామతీర్థం విగ్రహ ధ్వంసం చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఘటన జరగడానికి ముందు రోజు కొండపైకి టీడీపీకి చెందిన వారు వెళ్లారని, ఆధారాలు కూడా ఉన్నాయని, బాధ్యులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ఒక కుట్రదారుడని వ్యాఖ్యానించారు. 

విజయసాయిరెడ్డి ఆరోపణలపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. ‘ఏ1 క్రిమినల్ సీఎం.. తన డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడు. నీ బతుకు ఫేక్..నీ పార్టీ ఫేక్.. నీ హామీలు ఫేక్.. నీ పాలన ఫేక్.. చివరికి నాపై నీ దొంగ బ్యాచీతో చేయించే ఆరోపణలూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది’ అంటూ ఫైర్ అయ్యారు. 

‘ఎన్నాళ్లీ దొంగలతో దొంగ ఆరోపణలు జగన్ రెడ్డి.. సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వే రా తేల్చుకుందాం.. నువ్వు నా పై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా?’ అంటూ సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్ విసిరారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తున్నామన్నారు.  

Leave a Comment