వారంలోపే బియ్యం కార్డులో పేర్లు..

బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు నమోదుకు గతంలో అనుమతించకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఏళ్లు గడిచినా వాటికి సమాధానం దొరికేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి పేదలు ఉపశమనం పొందారు.

దరఖాస్తు చేసిన వారంలోపు కార్డులో పేర్లు నమోదు చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో 11.88 లక్షల మంది పేర్లు బియ్యం కార్డుల్లో కొత్తగా నమోదు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.50 కోట్లకు పేగా ఉన్న బియ్యం కార్డుల్లో 4.33 కోట్లకు పైగా పేర్లు నమోదై ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసి ఆధార్ తదితర వివరాలు సమర్పించాలి. లేదా గ్రామ వలంటీర్ కు పేరు నమోదు చేయాల్సిన వారి వివరాల ఇవ్వాలి. ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటే వారంలోపే పేర్లు నమోదవుతాయి. 

Leave a Comment