48 గంటల్లో ఇంటి నిర్మాణం..ఏపీలో ఫస్ట్ ఇదే..!

రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్ నిర్మింతమైంది. దీనిని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో నిర్మించారు. 320 గజాల్లో అత్యుత్తమ టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్ ను రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ సోమవారం ప్రారంభించారు. సోలార్ రూఫ్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్ తో రూపొందించిన మోడల్ హౌస్ ను కేవలం 48 గంటల్లో పూర్తి చేశారు. 

ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక మోడల్ హౌస్ నిర్మించారన్నారు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ మౌడల్ హౌస్ నిర్మాణానికి సుమారు రూ.3.5 లక్షల లోపు ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఈ ఇంటికి 50 ఏళ్ల జీవిత కాలం ఉంటుందని భరత్ వివరించారు. 

Leave a Comment