‘మహాభారత్’ పాటను అద్భుతంగా పాడిన ముస్లిం వ్యక్తి.. ‘ఇది మన నిజమైన ఇండియా’ అంటున్న నెటిజన్లు

ఓ ముస్లిం వ్యక్తి పాడిన పాట ఎంతో మంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ‘మహాభారత్’ సిరీస్ టైటిల్ సాంగ్ ను ఎంతో అద్భుతంగా పాడారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్ వై.ఖురైషీ షేర్ చేశారు.

ఈ వీడియోలో మహాభారత్ కథలోని శ్లోకాలను మంచి ఉచ్చారణతో ఆ ముస్లిం వ్యక్తి పాడారు. పాట మధ్యలో కాసేపు ఆగి శంఖం ఊదినట్లు సౌండ్ చేశారు. తర్వాత మళ్లీ పాటను కొనసాగించాడు. ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇది మన నిజమైన భారతదేశం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతో మంది ఆయనను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కూడా ఈ ప్రదర్శను ‘అద్భుతం మరియు స్ఫూర్తిదాయకం’ అని అభివర్ణించారు.  

   

Leave a Comment