మార్చి 10న ఏపీలో మున్సిపల్ ఎన్నికలు..!

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 10 మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

కాగా గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఇక విజయనగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 

 

Leave a Comment