సవ్వసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల భామ నిధి అగర్వాల్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అఖిల్ కు జోడిగా చేసిన మిస్టర్ మజ్నూ కూడా ఫ్లాప్ అయింది. అయితే మూడో ప్రయత్నంగా చేసిన ఇస్మార్ట్ శంకర్ ఈ అమ్మడి కెరీర్ ను మార్చేసింది. ఈ సినిమా హిట్ కావడంతో నిధికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
తాజాగా తమిళ అభిమానులు అందాల నిధికి వాలంటైన్స్ డే సందర్భంగా ఊహించని గిఫ్ట్ అందించారు. నిధి అగర్వాల విగ్రహం ఏర్పాటు చేసి, ఏకంగా పాలభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో నిధి ఫ్యాన్స్ క్లబ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ తమిళన అభిమానులు ఎంజీఆర్, ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి నటీనటులకు గుడి కట్టారు.
Nidhhi Agerwal STATUE] Simple and beautiful valentine’s Day gift from Tamil / Telugu fans to our Favourite Actress @AgerwalNidhhi ❤️ #NidhhiAgerwal #NationalCrushNidhhi pic.twitter.com/49B34qjCSW
— Nidhhi Agerwal (@Nidhi_TeluguFC) February 14, 2021