శ్రీలంక, నేపాల్ లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్లాన్ : త్రిపుర సీఎం

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇందుకు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. రాజధాని అగర్తలలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమిషా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు పార్టీ విస్తరణ గురించి మాట్లాడారని తెలిపారు. అప్పుడు ఈశాన్య జోనల్ బీజేపీ సెక్రటరీ అజయ్ జమ్ వాల్ దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినందుకు అమిత్ షాకు అభినందనలు తెలిపారు. 

శ్రీలంక, నేపాల్ మిగిలి ఉన్నాయని, పార్టీని అక్కడ కూడా విస్తరించాలని అమిత్ షా సమాధానం చెప్పారని విప్లవ్ దేవ్ అన్నారు. నేపాల్, శ్రీలంకలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పినట్లు చెప్పారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేయనుందని ఆయన వ్యాఖ్యానించారు. 

 

Leave a Comment