శ్రీవల్లి పాటకు ముంబై పోలీసు బ్యాండ్.. వీడియో వైరల్..!

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాకు ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందులోని పాటలు, డైలాగ్ కి ఎంతో క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా శ్రీవల్లి పాట.. అందులో మ్యూజిక్, అల్లు అర్జున్ డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట సినిమా విడుదలకు ముందే ప్రభంజనం సృష్టించింది..

శ్రీవల్లి సాంగ్ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట ముంబై పోలీసుల మనసును కూడా దోచింది. ముంబై పోలీస్ బ్యాండ్ కి చెందిన కళాకారులు శ్రీవల్లి పాటను వాయించారు. క్లారినెట్, సాక్సోఫోన్, ట్రంపెట్, ఫ్లూట్ వంటి సంగీత వాయిద్య పరికరాల ద్వారా ఆకట్టుకున్నారు. వాటిలో శ్రీవల్లి పాట వచ్చేలా వాయించి మైమరిపంచారు. ఈ పాటను ముంబై ప్రజలకు అంకితమిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment