కరోనా రోగిపై లైంగిక దాడి..ముంబై డాక్టర్ పై కేసు

ముంబైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో కోవిడ్-19కు చెందిన 44 ఏళ్ల రోగిపై లింగిక దాడి కేసులో 34 ఏళ్ల వైద్యుడిపై కేసు నమోదైంది. నిందితుడు ఒక రోజు ముందే ఆస్పత్రిలో చేరాడు. 

అయితే కరోనా వైరస్ రోగితో సంబంధం ఉన్నందున నిందితుడికి కరోనా సోకిందనే భయంతో వైద్యుడిని ఇంకా అరెస్టు చేయలేదని అగ్రిపాడా పోలీసులు తెలిపారు. బదులుగా వారు థానేలోని ఒక అపార్ట్మెంట్ బ్లాక్ లో వైద్యుడి ఇంటిని నిర్భంధం చేసినట్లు పోలీసులు చెప్పారు. 

ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు వైద్యుడు ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రోటోకాల్ ప్రకారం ఆస్పత్రి పరిపాలన విభాగం వైద్యుడిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 30న రోగిని చేర్చుకున్న రోజునే వైద్యుడు కూడా చేరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మే1న ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఆస్పత్రి హెచ్ ఆర్ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐసీపీ సెక్షన్ 377, 269, 270 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Leave a Comment