ఆ వ్యక్తిని తాను కాదు..అంటున్న అమీర్ ఖాన్

లాక్ డౌన్ సమయంలో నిరుపేదలకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గోధుమ సంచుల్లో డబ్బు పెట్టి పంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గోధుమ సంచిలో రూ.15వేలు పెట్టి పంచినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయతే ఆ వార్తలను అమీర్ ఖాన్ ఖండించాడు. 

ట్విట్లర్ వేదికగా తనపై వచ్చిన వార్తపై అమీర్ స్పందించాడు. ఇది పూర్తిగా తప్పుడు వార్త అని ఖండించాడు. ఒక కిలో గోధుమ ప్యాకెట్లలో రూ.15 వేలు నగదు లోపల పెట్టి పంచిన వ్యక్తి తాను కాదని ట్విట్ చేశారు. ఈ వార్త పూర్తిగా అవావస్తం అయినా ఉండాలి లేక తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ”రాబిన్ హుడ్” అయినా పంచి ఉండాలి అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే అందరు ఇంటి దగ్గరే సురక్షితంగా ఉండాలని కోరారు. 

అయితే గత నెలలో అమీర్ ఖాన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇచ్చారు. అంతేకాకుండా ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ మరియు ఎన్జీవోల కు కూడా విరాళాలు అందజేశారు. 

Leave a Comment