6 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఆర్టీసీ..!

మహారాష్ట్ర రోడ్డు రవానా సంస్థ(ఎంఎస్ ఆర్టీసీ) ఆరు వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఎంఎస్ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై ఎంఎస్ ఆర్టీసీ క్రమ శిక్షణ చర్యలకు పాల్పడింది. 

ఇందులో భాగంగా శనివారం 3,100 మంది ఉద్యోగులను ఎంఎస్ ఆర్టీసీ సస్పెండ్ చేసింది. మరో 270 మందిని విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు 6,277 మంది సస్పెండ్ కాగా.. 1,496 మంది ఉపాధి కోల్పోయారు. ఇటీవల ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర రవాణా మంత్రి ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో మొత్తం 92 వేల మంది ఉద్యోగుల్లో 18 వేల మంది విధుల్లో చేరారని అధికారులు వెల్లడించారు. 

Leave a Comment