జగన్ సర్కార్ కూలిపోతుంది : ఎంపీ రాఘురామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచి పార్టీకి దూరమైన రఘురామ కృష్ణ రాజు జగన్ ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కార్ తప్పులను ఎత్తి చూపెడుతూ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు.  తాజాగా జగన్ సర్కార్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వచ్చిన ‘న్యాయదేవతపై నిఘా’ కథనంపై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని, ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. తన ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని ఆరోపించారు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ నిజమైతే..విచారణకు ఆదేశించాలని ఏపీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

కథనంపై ప్రభుత్వం సీరియస్..

ఆంధ్రజ్యోతి కథనంపై ప్రభుత్వం కూడా మండిపడింది. సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా, పక్కా వ్యూహంతోనే ఈ కథనం అల్లారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కథనంపై న్యాయ వ్యవస్థతో నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను వివరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  

Leave a Comment