వేడి అన్నం వడ్డించడం లేదంటూ అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు..!

అత్త తనకు వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలోని గజహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజ్ గన్వాలో అత్త, కోడలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరి భర్తలు వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈక్రమంలో తన అత్త సమయానికి ఆహారం వడ్డించడం లేదని కోడలు ఇటీవల పోలీసులకు కాల్ చేసింది. 

దీంతో పోలీసులు వచ్చి విచారించారు. తన అత్త రోజంతా టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటుందని, తనకు వేడి వేడి అన్నం పెట్టడం లేదని కోడలు పోలీసులకు చెప్పింది. తనకు పాడైన ఆహారం పెడుతుందని, దీని వల్ల తన ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొంది. ఈమె మాటలకు పోలీసులు షాక్ కు గురయ్యారు. కోడలి మాటలకు అత్త ఆగ్రహం వ్యక్తం చేసింది. 

తన కోడలు ఎప్పుడు ఫోన్ లో బీజీగా ఉంటుందని, ఇంట్లో పనులు చేయదని పోలీసులకు చెప్పింది. వంటింటి పనుల్లో కూడా తనకు సాయం చేయడం లేదని పేర్కొంది. వీరి వాదనలు విన్న పోలీసులు ఇద్దరినీ మందలించారు. మరో సారి చిన్న విషయాలకు ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

Leave a Comment