ప్రాణాలు తీసిన చికెన్ గ్రేవీ, కూల్ డ్రింక్..!

ఈ లోకంలో మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏ క్షణంలో అయినా.. ఏ రూపంలో అయినా రావచ్చు. తాజాగా ఆహారంలో చికెన్, కూల్ డ్రింక్ తీసుకొని తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల మేరకు తూత్తకుడి జిల్లా కోవిల్ పట్టిలోని తంగప్ప నగర్ కు చెందిన కర్పగం(30) తన ఇంటి సమీపంలోని ఓ హోటల్ లో బుధవారం చికెన్ గ్రేవీ తీసుకుంది. 

మధ్యాహ్నం భోజనంలో కర్పగం, ఆమె కూతురు దర్శిని(4) ఆ చికెన్ గ్రేవీని తిన్నారు. ఆహారం జీర్ణం కాకపోవడంతో సమీప దుకాణంలో ఓ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని తల్లీకూతుళ్లు తాగారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. 

వీరి మృతికి చికెన్ గ్రేవీ లేదా కూల్ డ్రింక్ కారణం కావచ్చని మృతుల బంధువులు కోవిల్ పట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. మరణానాకి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ప  

Leave a Comment