అద్వానీతో కేక్ కట్ చేయించిన మోడీ..!

బీజేపీ కుర వృద్ధుడు ఎల్ కే అద్వానీ ఆదివారం తన 93వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షులు తెలిపారు. అద్వానీతో ప్రధాని మోడీ కేక్ కట్ చేయించారు. అనతరం ఆయన ఆశీస్సులు తీసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. 

అద్వానీ ఇంటికి వెళ్లిన ఫొటోలను ప్రధాని మోడీ ట్విట్టర్ లో షేర్ చేశారు. అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వెళ్లామని, ఆయనతో సమయం గడపడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని మోడీ పేర్కొన్నారు. తన లాంటి కార్యకర్తలకు, అద్వానీ మద్దతు, మార్గదర్శకత్వం అమూల్యమైనదని, దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అపారమైనదని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. 

Leave a Comment