బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ..వైరల్ వీడియో..!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఉన్నావ్ లో పాల్గొన్నారు. వేదికపై బీజేపీ జిల్లా అధ్యక్షుడి పాదాలకు నమస్కరించారు. 

ఉన్నావ్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు అవదేశ్ కతియార్ శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. దానిని ప్రధాని మోడీ స్వీకరించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ పాదాలను అవదేశ్ తాకేందుకు ప్రయత్నించారు. కానీ ప్రధాని మోడీ అవదేశ్ ను ఇలా చేయవద్దని వారించారు. మీరు కాదు.. నేను మీకు మొక్కాలి అని సంజ్ఞ చేస్తూ ప్రధాని మోడీ వెంటనే అవదేశ్ పాదాలకు నమస్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment