వామ్మో.. బాడీలో ఆ పార్ట్ కి రూ.13 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించిన మోడల్..!

సాధారణంగా ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలకు ముందుస్తు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అంతేకాదు మనిషి లైఫ్ కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశాన్ని బీమా కంపెనీలు కలగజేస్తున్నాయి. అయితే ఓ మోడల్ తన శరీరంలోని ఓ ప్రైవేట్ పార్ట్ కి ఏకండా కోట్లలో ఇన్సూరెన్స్ చేయించి వార్తల్లో నిలిచింది. 

బ్రెజిల్ కి చెందిన మోడల్ నాథీ కిహారా తన శరీరంలోని ఓ పార్ట్ కి ఏకంగా రూ.13 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించింది. కిహారా తన అందానికి కారణం పిరుదులు అని భావిస్తుంది. తన శరీరంలో అత్యంత విలువైన  భాగంగా భావిస్తున్న పిరుదుల భద్రత కోసం ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1.3 మిలియన్ పౌండ్లకు, అంటే మన కరెన్సీలో రూ.13 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించింది. ప్రస్తుతం ఈ ఇన్సూరెన్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

2021 మిస్ బుమ్ బుమ్ టైటిల్ ని నాథీ కిహారా గెలిచింది. ఈ టైటిల్ గెలిచేందుకు తన పిరుదులే కారణం అని ఆమె చెబుతోంది. తనకు అంత ఫేమ్, ఇమేజ్ తెచ్చిపెట్టిన పిరుదుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ ఇన్సూరెన్స్ మామూలుగా ఏమీ రాదు.. ఆమె పిరుదులకు నిజంగా డ్యామేజ్ జరిగితేనే వస్తాయి.. తమంతట తాము డ్యామేజ్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా రాదు. దీంతో ఎవరి పిచ్చి వాళ్లది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ పిరుదులకు ఇన్సూరెన్స్ చేయించడం పట్ల మీరేమంటారు.. 

 

Leave a Comment