కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామ కృష్ణారెడ్డి కన్నుమూత..!

 కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామ కృష్ణారెడ్డి(72) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

చల్లా రామకృష్ణారెడ్డి 1948 ఆగస్టు 27న జన్మించారు. ఆయన పాణ్యం ఎమ్మెల్యేగా, కోయిలకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయాంలో పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.  చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చల్లా మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ భ్యులకు సానుభూతి తెలిపారు.

Leave a Comment