ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి..!

2020 టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్నే నింపింది. ఈ ఏడాదిలో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు మరణించారు. ఈఏడాది చివరి నటుడు నర్సింగ్ యాద్(52) కన్నుమూశారు. చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన  సోమాజిగూడు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.  

నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. కామెడీ, విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. మైలా నరసింహా యాదవ్ ను సినీ ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కామెడీ విలన్ గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 

 

Leave a Comment