తెలంగాణలోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్.. కేసీఆర్ దమ్ముంటే ఆపండి. రాజాసింగ్ సవాల్..!

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందని, దమ్ముంటే ఆపాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కి ప్రధాని మోడీ భయం పట్టుకుందన్నారు. అందుకే ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ తప్పించుకుని తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు.. 

ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో శివసేన రెబల్ నేత ఏక్నాథ్ శిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈనేపథ్యంలో అటువంటి పరిస్థితి తెలంగాణలోనూ వస్తుందని, టీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని, దమ్ముంటే కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ కు రాజాసింగ్ సవాల్ విసిరారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో ‘శిండే’ ఎవరు అనేది మాత్రం రాజాసింగ్ చెప్పలేదు..

 

 

Leave a Comment