కరోనాతో ఎమ్మెల్యే మృతి..

కరోనా వైరస్ తో తమిళనాడులో ఓ ఎమ్మెల్యే మరణించారు. డీఎంకే పార్టీకి చెందిన అన్బజగన్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకో విషాదం ఏంటంటే ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం. 

గత వారం అన్బజగన్ కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్ గా తేలింది. రెండు రోజుల క్రితం ఆయన బాగానే ఉన్నారు. అయితే తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయనకు వెంటిలేటర్ పై ఉంచారు. ఆయనకు రక్తపోటు, గుండె పనితీరు కూడా క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థతి విషమంగా ఉందని, ఆయన 80 శాతం వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

Leave a Comment