బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. ఇక రావణుడిగా బాలీవుడ్ హిరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా, లక్ష్మణుడి పాత్రను సన్నీ పోషిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాలో సీతమ్మగా కృతి సనన్ నటించనుంది. ఈ విషయాన్ని కృతి సనన్ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది. నాకు ప్రత్యేకమైన వాటిలో ఒకటి.. ఆదిపురుష్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అంటూ పేర్కొంది.
A new journey begins.. ❤️
One of my most special ones.. overwhelmed to be a part of #Adipurush #Prabhas #SaifAliKhan @mesunnysingh @omraut #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/198BqAuoXT— Kriti Sanon (@kritisanon) March 12, 2021