‘మహిళలకు ప్రధాని మోడీ కానుక ఇచ్చారు’.. మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్!

ఇప్పటికే పెరిగిన నిత్యవాసరాల ధరలతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. దీనికి తోడు కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను పెంచి మరో భారం వేసింది. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం రూ.50 పెంచింది. ఈనేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీని విమర్శిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు..  

” మంచి రోజులు వచ్చేశాయ్ (అచ్చేదిన్‌ ఆగయే).. అందరికీ శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ ధరను కేంద్రం పెంచేసింది. ప్రధాని సిలిండర్‌ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చేశారు ” అని కెటిఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. తాజాగా పెంచిన ధరతో ఇప్పుడు వంటింటి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,055 నుంచి రూ.1,105 కు చేరిన విషయం తెలిసిందే !

 

Leave a Comment