వంద మంది ‘వకీల్ సాబ్’ లు వచ్చినా.. మా ‘సీఎం సాబ్’ని ఏమీ చేయలేరు..!

తిరుపతి ఉప ఎన్నికలో లక్షల మెజార్టీతో వైసీపీ విజయం సాధిస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైసీపీ కార్యాయలంలో మీడియా సమావేంలో మంత్రి మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మకయ్యాయని మండిపడ్డారు. టీడీపీ విగ్రహాలు ధ్వంసం చేసి ఉదయాన్నే రచ్చ చేస్తుందన్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు మనుషులు నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్తే, దానిపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

టీడీపీ, బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి అనిల్ ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేసి 24 గంటలైనా టీడీపీ సమాధానం చెప్పలేదన్నారు. సీఎం జగన్ సభ పెడితే లక్షలాది మంది జనం వస్తారని, ప్రజారోగ్యం దృష్ట్యా తిరుపతి సభను సీఎం రద్దు చేసుకున్నారని తెలిపారు. 

వకీల్ సాబ్ సినిమా టికెట్ల గురించి చంద్రబాబుకు ఏం సంబంధమని, పెద్ద రెమ్యూనేషన్ తీసుకొని కూడా టికెట్ల ధరలు పెంచి అభిమానులను దోచుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించారు. వకీల్ సాబ్ ను చూసి సీఎం జగన్ భయపడ్డాడు అని కొందరు మాట్లాడుతున్నారని, ఇలాంటి సాబ్ లు వంద మంది కలిసి వచ్చినా మా సీఎం జగన్ సాబ్ ను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. తిరుపతిలో వైసీపీ విజయం ఎప్పుడో ఖాయమైందన్నారు.  

Leave a Comment